బియ్యపు గింజపై రామ మందిరం..!

 బియ్యపు గింజపై రామ మందిరం..!

      వరంగల్‌ జిల్లా మైక్రో ఆర్టిస్ట్‌ అద్భుతం

నర్సంపేట, వెలుగు: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ బియ్యం గింజపై రామ మందిరాన్ని గీసి భక్తిని చాటుకున్నారు. అంతేకాకుండా ఓ వృక్షాన్ని గీయడంతో పాటు జై శ్రీరామ్ అని హిందీలో రాశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ.. రాముడిపై ఉడుత భక్తిగా బియ్యపు గింజపై రామ మందిర చిత్రాన్ని రెండ్రోజుల్లో చిత్రీకరించానన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఈతరం ప్రజలు వీక్షించడం అదృష్టమన్నారు. రామయ్య ఆశీస్సులతో దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగలని ఆకాంక్షించారు.