రామగుండంలో బీఆర్ఎస్కు షాక్ .. కాంగ్రెస్ లోకి మాజీ మేయర్

రామగుండంలో బీఆర్ఎస్కు షాక్ .. కాంగ్రెస్ లోకి మాజీ మేయర్

రామగుండంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. రామగుండం మాజీ మేయర్ రాజమణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఆమెతో పాటుగా100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  రాజమణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ . వంద రోజుల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు రాజమణి.  

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలన అందిస్తున్నామని అన్నారు  ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. గత పాలకులు రామగుండాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారని ఆరోపించారు.  అభివృద్ధికి ఆమడ దూరాన ఉన్న రామగుండానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.