- రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీ రాజ్ఠాకూర్
పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించుకుంటే కేంద్రం నుంచి మనకి రావాల్సిన నిధులు తీసుకొస్తాడని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీ రాజ్ ఠాకూర్ అన్నారు. ఇవాళ పాలకుర్తి మండలం తక్కళ్లపెల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కేంద్ర నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని ఆమె హామీ ఇచ్చారు. కాకా మనవడికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వంశీ కృష్ణ కు ఎంపీగా గా ఒక్క అవకాశం ఇచ్చి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆమె చెప్పారు.