6 ఏళ్ల తర్వాత షుస్ వేసుకున్న బీజేపీ నేత.. వీడియోను షేర్ చేసిన మాజీ సీఎం

6 ఏళ్ల తర్వాత షుస్ వేసుకున్న బీజేపీ నేత.. వీడియోను షేర్ చేసిన మాజీ సీఎం

రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తేనే చెప్పులు, బూట్లు ధరిస్తానని ఆరేళ్ల క్రితం శపథం చేసిన ఓ నాయకుడి కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి ఆ నాయకుడు బూట్లు, చెప్పులు వేసుకోకుండా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పని చేశాడు. ఆయన తలచినట్లుగానే మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడంతో ఇవాళ (డిసెంబర్ 23న) షూస్ వేసుకున్నారు. 

2018లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి నుంచి బీజేపీ విజయం సాధించే వరకు చెప్పులు తొడగనని బీజేపీ అనుప్పూర్ జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా ఉన్న రాందాస్ పూరి శపథం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆరేళ్ల విరామం తర్వాత డిసెంబర్ 23న తన కాళ్లకు బూట్లు తొడిగారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఆయనకు షూలను అందించారు. 

దీనికి సంబంధించిన వీడియోను శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘రామదాస్ పూరీ కష్టపడి పనిచేసే వ్యక్తి. అతను 2017 నుండి బూట్లు, చెప్పులు వేసుకోకుండా పార్టీ కోసం పని చేశాడు. ఇప్పడు ఆయన శపథం నెరవేరింది’ అంటూ ట్వీట్ చేశారు. 

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 163 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కేవలం 66 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.