రామోజీరావును కలిసిన సీఎం రేవంత్రెడ్డి

రామోజీరావును కలిసిన సీఎం రేవంత్రెడ్డి

రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావును సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం(మార్చి4)  ఫిల్మ్ సిటీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గంటకు పైగా రామోజీ రావుతో పలు అంశాలపై చర్చించారు.  

ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి రామోజీరావును కలుసుకున్నారు. ఈ భేటీలో రామోజీరావు ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి.. రామోజీరావుతో  మొదటిసారి కలిశారు.