ఆగస్టు నుండి యానిమల్ ఔట్.. ఓ పక్క చిరు.. మరోపక్క రజినీ

ఆగస్టు నుండి యానిమల్ ఔట్.. ఓ పక్క చిరు.. మరోపక్క రజినీ

రన్బీర్ కపూర్(Ranbir kapoor) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal) మూవీ పోస్ట్ పోన్ కానుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి(Arjun reddy) ఫెమ్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా .. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అందరూ భావించారు. అయితే ఇంటర్నల్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా పెండింగ్లో ఉందట. అందుకే సినిమాను పోస్ట్ ఫోన్ చేయాలని నిర్ణయిచుకున్నారట మేకర్స్. 

అంతేకాదు.. ఆగస్టు 11న సౌత్ నుండి ఇద్దరు బడా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) హీరోగా వస్తున్న భోళా శంకర్(Bhola shankar) కాగా.. మరొకటి సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరోగా వస్తున్న జైలర్(Jailer). ఈ ఇద్దరు స్టార్ హీరోలకు మాస్ లో మంచి బేస్ ఉంది. ఈ సినిమాలతో పోటీగా వెళితే.. అదికాస్తా యానిమల్ సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా కూడా యానిమల్ సినిమా మేకర్స్ మూవీని పోస్ట్ పోన్ చేయనున్నారని టాక్. 

ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకొని.. సినిమాను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకొని డిసెంబర్ నెలలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట యానిమల్ మేకర్స్. ఇక ఈ సినిమాలో రన్బీర్ కు జోడీగా.. నేషనల్ క్రష్ రష్మికా మందనా(Rashmika Mandana) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ ఐన ప్రీ టీజర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే.. డిసెంబర్ వరకు ఆగాల్సిందే.