చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మొయినాబాద్ – సురంగల్ బైపాస్ వద్ద పోలీసులు గస్తీ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న హరిజన రామకృష్ణ (20), బద్దుల విజయ్ కుమార్ (22)ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వీరు మొయినాబాద్లో నాలుగు, చేవెళ్లలో ఒకటి, కూకట్ పల్లిలో ఒకటి కలిపి మొత్తం ఆరు బైకులు దొంగిలించినట్లు అంగీకరించారు. నిందితుల ఇండ్ల వద్ద దాచిపెట్టిన ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆదివారం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
