20 కిలోల అక్రమ గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్

20 కిలోల అక్రమ గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్

ఒడిశా నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ALSO READ : ఈజిప్టులో ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌లపై కాల్పులు.. ముగ్గురి మృతి

రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో నాగార్జున సాగర్ రహదారిపై గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి వెయ్యి రూపాయల నగదు, 20కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా ఖాదీం థానా బుల్దానా ఠానాకు చెందిన సచిన్ సంతోష్ జాదవ్, ఝమ్‌ఖేడ్ గ్రామానికి చెందిన శరత్ భరత్ పవార్ గా గుర్తించారు పోలీసులు.