ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు  మృతిచెందారు. 

షాద్ నగర్ పరిధిలోని సోలీపూర్ జాతీయ రహదారిపై అదుపుతప్పిన బొలెరో వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులందరూ వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.