హుక్కా సెంటర్ పై పోలీసుల దాడి.. 20మంది అరెస్ట్

హుక్కా సెంటర్ పై పోలీసుల దాడి.. 20మంది అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలో  హుక్కా సెంటర్ పై పోలీసులు దాడిచేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేంద్రం నుండి హుక్కా పరికరాలను, ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రహస్యంగా హుక్కా సెంటర్‌ను నడుపుతున్నాడు. లేట్ నైట్ వరకు షాపు తెరచి ఉంచడంతో దానిపై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో 20 మంది యువకులు హుక్కా, నిషేదిత ఈ సిగరెట్లను సేవిస్తున్నారు. వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.