పదకొండేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

పదకొండేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

జీడిమెట్ల, వెలుగు: బాలికపై అత్యాచారయత్నం ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ బాలిక(11) మంగళవారం రాత్రి ఇంటి ముందు సైకిల్ తొక్కుతోంది. దగ్గరలోని టెంట్ హౌస్ లో పనిచేసే సూరత్ కు చెందిన ఓ వ్యక్తి  బాలిక దగ్గరికి వచ్చాడు.  మాయమాటలు చెప్పి టెంట్ హౌస్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు జీడిమెట్ల పీఎస్​లో కంప్లయింట్ చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.