బాలీవుడ్లో రష్మిక జోరు

బాలీవుడ్లో రష్మిక జోరు

సౌత్‌‌లో ఎంత మంచి పొజిషన్‌‌కి చేరినా.. నార్త్‌‌లో అడుగుపెట్టాలని ఆశపడుతుంటారు హీరోయిన్లు. గతంలో చాలామంది అటువైపు అడుగులేశారు. కానీ వరుస సినిమాలతో బిజీ అయిపోయిన వాళ్లు ఎవరూ లేరు. కానీ రష్మిక మాత్రం బాలీవుడ్‌‌లోనూ తన జోరు చూపిస్తోంది. ఆల్రెడీ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ మూవీ చేసింది. అమితాబ్‌‌తో కలిసి ‘గుడ్‌‌ బై’ చిత్రంలో నటిస్తోంది. రణ్‌‌బీర్‌‌‌‌ సరసన ‘యానిమల్‌‌’లోనూ కనిపించనుంది. ఇప్పుడు మరో మంచి చాన్స్ సంపాదించినట్టు తెలిసింది. టైగర్‌‌‌‌ ష్రాఫ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌‌గా సెలెక్టయ్యింది రష్మిక. ఇదొక రొమాంటిక్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్. సెప్టెంబర్‌‌‌‌లో మూవీ సెట్స్‌‌కి వెళ్లబోతోంది. బద్రీనాథ్‌‌కీ దుల్హనియా, ధడక్ లాంటి చిత్రాలు తీసిన శశాంక్ ఖేతన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో ఓ పవర్ ప్యాక్డ్‌‌ రోల్‌‌కి రష్మికని తీసుకున్నారట. ప్రాజెక్ట్ విషయంలో రష్మిక చాలా ఎక్సయిటవుతోందని, ఆమె క్యారెక్టర్‌‌‌‌ చాలా కొత్తగా ఉండబోతోందని మూవీ టీమ్‌‌ నుంచి ఒకరు రివీల్ చేయడంతో ఈ విషయం బైటికి వచ్చింది. ‘పుష్ప’ మూవీ తర్వాత బాలీవుడ్‌‌లో రష్మిక క్రేజ్ మరింత పెరిగిందనేది నిజం. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి కమిటవుతూ వెళ్తుంటే ఆ క్రేజ్ రెట్టింపవడం, నార్త్‌‌లోనూ రష్మిక చక్రం తిప్పడం ఖాయమనిపిస్తోంది.