వారం గ్యాప్తో ఇటు సౌత్, అటు బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది రష్మిక. విజయ్కు జంటగా ఆమె నటించిన ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. దీంతో ఓవైపు చెన్నైలో ‘వారసుడు’ మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటున్న రష్మిక.. మరోవైపు ముంబైలో హిందీ మూవీ ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్తోనూ బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా ఆమె నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 20న నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది. దీంతో ప్రమోషన్లో స్పీడు పెంచారు.
ఇటీవల ‘రబ్బా జాన్ద’ అంటూ సాగే పాటను ముంబైలో లాంచ్ చేశారు. ‘రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ గుర్తొస్తుంది. సౌత్లో మాస్ మసాలా సాంగ్స్, ఐటం నంబర్స్ ఎక్కువ. పైగా ఇదే నా ఫస్ట్ హిందీ రొమాంటిక్ సాంగ్ కావడంతో ఎక్సైటింగ్గా ఉన్నాను’ అని చెప్పింది రష్మిక. 1970 బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు శంతను బాగ్చి. ఓ వైపు లవ్ స్టోరీ, మరోవైపు దేశభక్తి ఉన్న సినిమా ఇదని, యాక్షన్ ప్యాక్డ్ స్క్రీన్ప్లేతో తీసిన ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు మేకర్స్. ఇక రష్మికకు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. సెకెండ్ మూవీ ‘గుడ్ బై’ ముందుగా రిలీజై ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా రిజల్ట్ ఆమె బాలీవుడ్ కెరీర్కు కీలకంగా మారింది.