- ఎన్నికల కమిషన్కు రావి రాయణ రెడ్డి మనుమరాలు వినతి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల రిలీజైన రజాకార్ సినిమా టీజర్ను వెంటనే నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ను రావి నారాయణ రెడ్డి జాతీయ ఫౌండేషన్ సభ్యురాలు, రావి నారాయణ రెడ్డి మనువరాలు రావి ప్రతిభారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం రావి ప్రతిభారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధిపొందేందుకే ‘రజాకార్’ సినిమాలో మతపరమైన అంశాలను పొందుపర్చారని విమర్శించారు. సినిమాలో వాస్తవాలను కప్పిపుచ్చారని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక మతపరమైన పోరాటంగా చిత్రీకరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారని తెలిపారు. ఈ ఉద్యమంలో మగ్దూం మొహియుద్దీన్ వంటి అనేక మంది నాయకులు ఉన్నారని, వీరి గురించి ఎందుకు చూపించడం లేదని సినీ నిర్మాతలను ప్రశ్నించారు. మతపరంగా మాత్రమే తీసిన రజాకార్ను వెంటనే ఆపాలని ప్రతిభారెడ్డి కోరారు.