రైల్వే ఉద్యోగులకు బంధన్​ బ్యాంకు నుంచి పెన్షన్

రైల్వే ఉద్యోగులకు బంధన్​ బ్యాంకు నుంచి పెన్షన్

హైదరాబాద్​, వెలుగు: బంధన్ బ్యాంక్ ఇండియన్ రైల్వే మాజీ ఉద్యోగులకు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంపిణీ చేయడానికి ఆర్​బీఐ అనుమతి పొందింది. దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులతో భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ సంస్థ.

పెన్షన్ పంపిణీ ప్రక్రియను అమలు చేయడానికి బ్యాంక్ త్వరలో రైల్వే మంత్రిత్వ శాఖతో కలసి పనిచేయనుంది.  పదవీ విరమణ చేసిన దాదాపు 15 లక్షల మంది భారతీయ రైల్వే పెన్షనర్లకు బంధన్​ బ్యాంకు ద్వారా పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుతుంది.   పెన్షనర్లు 1,640కిపైగా బ్యాంకుల్లో డబ్బు పొందవచ్చు.