
న్యూఢిల్లీ : రుణాలు మాఫీ చేస్తామంటూ పేపర్లు, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని ప్రజలకు ఆర్బీఐ సూచించింది. రుణ మాఫీ ఆఫర్లను ప్రకటిస్తూ బారోవర్లను కొంత మంది ఆకర్షిస్తున్నారని, తప్పుదోవ పట్టించే యాడ్లు ఇస్తున్నారని ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. రుణాలను మాఫీ చేసినట్టు సర్టిఫికేట్ను ఇష్యూ చేస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నారని వెల్లడించింది.