ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీపై మార్కెట్‌‌‌‌‌‌‌‌ దృష్టి .. 25 బేసిస్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు తగ్గించే ఛాన్స్

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీపై మార్కెట్‌‌‌‌‌‌‌‌ దృష్టి .. 25 బేసిస్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు తగ్గించే ఛాన్స్

న్యూఢిల్లీ:  ఈ వారం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌పై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టనున్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 4 శాతం కంటే దిగువన ఉండడంతో జూన్​ 6న జరిగే మీటింగ్​లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు   తగ్గిస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  రేట్ల కోత ఉంటే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు పీఎంఐ డేటా, ఆటో సేల్స్‌‌‌‌‌‌‌‌ నెంబర్లు, జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌ వంటి ఎకనామిక్ డేటా , గ్లోబల్ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌ కూడా మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను నిర్ణయించనున్నాయి. 

 ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐల) కదలికలపై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలి.  యూఎస్  టారిఫ్స్ సంబంధిత వార్తలు కూడా మార్కెట్‌‌‌‌‌‌‌‌ను నడిపించనున్నాయి. యూఎస్, చైనా మధ్య కుదిరిన తాత్కాలిక ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌ ఆగిపోయేటట్టు కనిపిస్తోంది. చైనా ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌ను పాటించడం లేదని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే.  “జూన్ 6న జరిగే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ నిర్ణయాలపై అందరి దృష్టి ఉంటుంది. కొత్త నెల స్టార్ట్ అవుతున్నందున, ఆటో సేల్స్ నెంబర్స్, ఇతర ఎకనామిక్ ఇండికేటర్స్‌‌‌‌‌‌‌‌కు మార్కెట్ స్పందిస్తుంది” అని  రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు.