డు ఆర్ డై మ్యాచ్..బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ

 డు ఆర్ డై మ్యాచ్..బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ

చావో రేవో మ్యాచుకు బెంగుళూరు, రాజస్తాన్ సిద్ధమయ్యాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బెంగుళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు పాయిట్ల పట్టికలో ఇరు జట్లు 6 పరాజయాలతో ఉన్నాయి. మరో మ్యాచ్లో ఓడిపోతే మాత్రం రెండు జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారనున్నాయి. 


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు;  డు ప్లెసిస్ (కెప్టెన్), కోహ్లీ, మ్యాక్స్ వెల్, అనుజ్ రావత్, లొమ్రోర్, దినేశ్ కార్తీక్, బ్రేస్ వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, సిరాజ్

రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు: బట్లర్, జైస్వాల్, సంజూ శాంసన్  (కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, హెట్ మేయర్, అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, ఆసిఫ్,  చాహల్