
ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4 లో నిలిచి ప్లేయర్ ఆఫ్స్ కు అర్హత సాధించాయి. నేడు జరగబోయే మ్యాచ్ లక్నోకి నామమాత్రమే అయినా ఆర్సీబీకి మాత్రం చాలా కీలకం. చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ పోరులో నెగ్గి టాప్-2 ప్లేస్తో నేరుగా క్వాలిఫయర్-1 ఆడాలని భావిస్తోంది.
ALSO READ | PBKS vs MI: మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ చిల్.. అయ్యర్ నడకను ఎగతాళి చేసిన హిట్ మ్యాన్
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోతే ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనే విషయం కూడా తెలుసుకోవాలి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రూల్స్ ప్రకారం ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు ప్రస్తుతం 17 పాయింట్లతో నిలిచిన ఆర్సీబీ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి. గుజరాత్ టైటాన్స్ కు కూడా సరిగ్గా 18 పాయింట్స్ ఉన్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య ఎవరికీ ఎక్కువగా రన్ రేట్ ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. దీని ప్రకారం గుజరాత్ కంటే ఎక్కువ రన్ రేట్ ఉన్న ఆర్సీబీ క్వాలిఫయర్ 1కు చేరుకుంటుంది.
ప్రస్తుతం బెంగళూరు రన్ రేట్ +0.255 ఉంది. మరోవైపు గుజరాత్ రన్ రేట్ +0.254 ఉంది. ఇప్పటికే పంజాబ్ క్వాలిఫయర్ 1కు చేరుకోగా.. ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే నేడు జరగబోయే మ్యాచ్ ఎలాంటి వర్ష సూచన లేదు. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గెలిచి గత మ్యాచ్లో సన్ రైజర్స్ చేతిలో ఓటమి నుంచి తేరుకొని లక్నో పని పట్టాలని ఆ జట్టు కోరుకుంటోంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ (10 మ్యాచ్ల్లో 18 వికెట్లు) రాక జట్టుకు బలం చేకూర్చింది. మరోవైపు గత మ్యాచ్లో గుజరాత్పై భారీ విజయం సాధించిన లక్నో ఆత్మవిశ్వాసంతో ఉంది. మార్క్రమ్, మార్ష్, పూరన్ సూపర్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు ప్లస్ పాయింట్.