డాబ‌‌‌‌ర్ ఇండియా కొత్త ప్రొడక్ట్​ ప్యాకేజ్డ్ కొబ్బరినీళ్లు

డాబ‌‌‌‌ర్ ఇండియా  కొత్త ప్రొడక్ట్​ ప్యాకేజ్డ్ కొబ్బరినీళ్లు

హైదరాబాద్​, వెలుగు: డాబ‌‌‌‌ర్ ఇండియా తన కొత్త ప్రొడక్ట్​ ప్యాకేజ్డ్ కొబ్బరినీళ్ల ప్రచారం కోసం నటుడు సిద్ధార్థ్​ మల్హోత్రాను నియమించుకుంది.  ‘‘ఐదు క్యూబుల పంచ‌‌‌‌దార‌‌‌‌ ఉండే కూల్ డ్రింకుల బ‌‌‌‌దులు రియ‌‌‌‌ల్ యాక్టివ్ కొబ్బరినీళ్లు తీసుకోండి. పంచ‌‌‌‌దార లేకుండా శ‌‌‌‌రీరాన్ని పూర్తి ఆరోగ్యక‌‌‌‌రంగా ఉంచే పానీయాలు తాగండి”అని ఆయన ఈ ప్రచారం ద్వారా కోరారు. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్​ ఈ ప్రచారానికి స‌‌‌‌రైన వ్యక్తని, ఈ యాడ్స్​ను డిజిట‌‌‌‌ల్ ప్లాట్‌‌‌‌ఫారాలు, టీవీల్లో  ప్రచారం చేస్తున్నామని డాబర్​ తెలిపింది.