
హైదరాబాద్, వెలుగు: డాబర్ ఇండియా తన కొత్త ప్రొడక్ట్ ప్యాకేజ్డ్ కొబ్బరినీళ్ల ప్రచారం కోసం నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను నియమించుకుంది. ‘‘ఐదు క్యూబుల పంచదార ఉండే కూల్ డ్రింకుల బదులు రియల్ యాక్టివ్ కొబ్బరినీళ్లు తీసుకోండి. పంచదార లేకుండా శరీరాన్ని పూర్తి ఆరోగ్యకరంగా ఉంచే పానీయాలు తాగండి”అని ఆయన ఈ ప్రచారం ద్వారా కోరారు. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ఈ ప్రచారానికి సరైన వ్యక్తని, ఈ యాడ్స్ను డిజిటల్ ప్లాట్ఫారాలు, టీవీల్లో ప్రచారం చేస్తున్నామని డాబర్ తెలిపింది.