వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మట్కా’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది.1958, 1982 మధ్య జరిగే కథ కావడంతో ఆ కాలాన్ని రీ క్రియేట్ చేసేలా ఓ భారీ సెట్ను నిర్మించారు.
వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ రవీంద్ర విజయ్, సత్యం రాజేష్, రవిశంకర్, అజయ్ ఘోష్, రూప లక్ష్మి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నామని చెబుతున్నారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.