
న్యూఢిల్లీ: దివంగత రాకేష్ జున్జున్వాలా భార్య రేఖ జున్జున్వాలా గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్లోని తమ వాటాలో దాదాపు సగాన్ని విక్రయించారు. దీంతో రేఖ జున్జున్వాలా వాటా 3.6 శాతానికి తగ్గింది. ఓపెన్ మార్కెట్లో ఈ అమ్మకం జరిగింది. ఈ నెల జూన్ 9–-10 మధ్య 12,36,500 షేర్లను (నజారాలో 1.4 శాతం వాటాకు సమానం) ఆమె విక్రయించారు. దీనికంటే ముందు అంటే ఈ నెల 2–-6 మధ్య 17,38,500 షేర్లు (1.98 శాతం వాటాకు సమానం) అమ్మారు. ఈ రెండు సేల్స్తో, నజారాలో రేఖ జున్జున్వాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాటా 7.05 శాతం షేర్హోల్డింగ్ నుంచి 3.66 శాతానికి తగ్గింది. ఏ ధర వద్ద షేర్లను అమ్మారో ప్రకటించలేదు. నజారా షేర్లు బుధవారం రూ.1,274 వద్ద ముగిశాయి.