పంద్రాగస్టు సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల : కేసీఆర్

పంద్రాగస్టు సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల : కేసీఆర్

ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ప్రగతి భవన్ లో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు.