ఏషియన్ పెయింట్స్‌‌లో 3.64 % వాటా అమ్మిన రిలయన్స్‌‌

ఏషియన్ పెయింట్స్‌‌లో 3.64 % వాటా అమ్మిన రిలయన్స్‌‌
  • డీల్‌‌ విలువ రూ.7,703 కోట్లు

న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్  అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం  ఏషియన్ పెయింట్స్‌‌లో తన 3.64 శాతం వాటాను విక్రయించింది. ఈ షేర్లను ఎస్‌‌బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.7,703 కోట్లకు ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా కొనుగోలు చేసింది. ఎన్‌‌ఎస్‌‌ఈ బ్లాక్‌‌ డీల్ డేటా ప్రకారం,  రిలయన్స్ ఇండస్ట్రీస్, తన అనుబంధ సంస్థ సిద్ధాంత్ కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 3.50 కోట్ల ఈక్విటీ షేర్లు (3.64 శాతం వాటా)ను అమ్మింది. 

ఒక్కో షేరుని రూ.2,201 ధరకు విక్రయించింది. దీంతో ఏషియన్ పెయింట్స్‌‌లో  సిద్ధాంత్ కమర్షియల్స్ షేర్‌‌హోల్డింగ్  4.90 శాతం  నుంచి 1.26 శాతానికి తగ్గింది. ఎస్‌‌బీఐ మ్యూచువల్ ఫండ్ తన షేర్‌‌హోల్డింగ్‌‌ను 1.51 శాతం నుంచి 5.15 శాతానికి పెంచుకుంది.