
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ విదేశాల్లో 1,500 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. గ్లోబల్గా విస్తరించడంలో భాగంగా కువైట్, యూఏఈ, మలేషియాలలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల కోసం రిలయన్స్ పవర్ పోటీ బిడ్లు సమర్పించింది. భూటాన్లో 2 పెద్ద ప్రాజెక్టుల ఏర్పాటుకు బిడ్స్ గెలుచుకుంది.