
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధానిలోని కాశ్మీరీ వలస దారులకు అడహాక్ మంత్లీ కింద ఆయా కుటుంబాలకు ఇచ్చే రిలీఫ్ను నెలకు రూ.10,000 నుంచి రూ.27,000 కి అంటే 170 శాతం పెంచేందుకు అమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాజ్నివాస్ అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాద బాధిత కశ్మీరీ కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ భద్రతా సంబంధిత వ్యయం (ఉపశమనం & పునరావాసం) పథకం కింద ఈ మొత్తాన్ని అందిస్తున్నారు.
ALSO READ : Cricket World Cup 2023: గంటకు 200 కిమీ వేగంతో డ్రైవింగ్.. రోహిత్కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
కాగా 1995లో కాశ్మీరీ వలసదారులకు రూ.5 వేలు నిర్ణయించగా దానిని 2007లో రెట్టింపు చేశారు. ఈ రిలీఫ్ మొత్తాన్ని ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లిస్తున్నారు. దాదాపుగా 2 వేల కుటుంబాలకు ఈ రిలీఫ్ అందిస్తుండగా దీని కోసం రూ.2.5 కోట్లు నెలవారీ ఖర్చు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.