గ్రూప్ 4లో పది ప్రశ్నలు తొలగింపు.. ఫైనల్ కీ రిలీజ్ చేసిన టీఎస్​పీఎస్సీ

గ్రూప్ 4లో పది  ప్రశ్నలు తొలగింపు..  ఫైనల్ కీ రిలీజ్ చేసిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 ఫైనల్ కీ రిలీజైంది. రెండు పేపర్లలో కలిపి మొత్తం10 ప్రశ్నలు తొలగించారు. శుక్రవారం గ్రూప్ 4 మాస్టర్  క్వశ్చన్  పేపర్​తో పాటు ఫైనల్​ కీని టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేసింది.  జులై 1న గ్రూప్ 4  ఎగ్జామ్  నిర్వహించగా.. ప్రిలిమినరీ కీని ఆగస్టు 28న విడుదల చేశారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, తాజాగా ఫైనల్ కీ విడుదల చేశారు. 

పేపర్1లో 11, 21, 60, 73, 129, 132, 148 క్వశ్చన్లను తొలగించారు. దీంతోపాటు మరో 8 క్వశ్చన్లలో ఆన్సర్  ఆప్షన్లలో మార్పులు చేశారు. ఇక 31వ ప్రశ్నకు నాలుగు ఆప్షన్లలో ఏది పెట్టినా సరైనదే అని ప్రకటించారు.  పేపర్ 2లో 25, 40, 78 మూడు క్వశ్చన్లను తొలగించగా, ఐదు క్వశ్చన్లకు ఆప్షన్లలో మార్పులు చేశారు.   

కాగా, గ్రూప్4 ఎగ్జామ్​ పేపర్1కు 7,63,835 మంది, పేపర్ 2కు 7,61,026  మంది హాజరయ్యారు. మరో వారంలోపు గ్రూప్​4 జనరల్ ర్యాకింగ్  లిస్టును (జీఆర్ఎల్​) టీఎస్​పీఎస్సీ రిలీజ్  చేయనున్నది. ఆ తర్వాత తుది ఫలితాలు వెల్లడించనుంది.