- రెనాల్ట్ సీఈఓ వెంకట్రామ్
హైదరాబాద్, వెలుగు : తమ కంపెనీ రాబోయే మూడేళ్లలో ఐదు కార్లను ఇండియా మార్కెట్కు తీసుకువస్తుందని, వీటిలో ఒక ఎలక్ట్రిక్ కారు కూడా ఉంటుందని ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ ఇండియా సీఈఓ, ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ వెల్లడించారు. దీని ధర రూ.12 లక్షలలోపు ఉండొచ్చని అన్నారు. హైదరాబాద్లో మంగళవారం క్విడ్, ట్రైబర్, డస్టర్ 2024 మోడళ్లను లాంచ్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
భారతదేశం సహా యూరప్ వెలుపల ఉన్న ఐదు కీలక అంతర్జాతీయ కేంద్రాల కోసం మూడు బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. 2023 క్యాలెండర్ సంవత్సరంలో 49 వేల యూనిట్లు అమ్మామని, ఈ సంవత్సరంలో వీటి సంఖ్య 20 శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇండియాలో తమకు 1.8 శాతం మార్కెట్ వాటా ఉందని వెంకట్రామ్ వివరించారు.