జనగామ, వెలుగు : జనగామ కలెక్టరేట్లోకి ఎంట్రీకి ఆంక్షలు విధించారు. ఈ నెల 17 తేదీతో జారీ చేసిన ఆర్సీ నెంబర్ జీఏ, సెక్యూరిటీ/2026/ 397ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చారు. దీంతో కలెక్టరేట్కు వచ్చే ప్రతి ఒక్కరూ గేటు వద్దే ఉన్న రిజిస్టర్లో పేరు, తండ్రి పేరు, ఊరు, ఏ డిపార్ట్మెంట్కు వెళ్తున్నారో పేర్కొనడంతో పాటు ఎంట్రీ టైం కూడా రాసి సంతకం చేసి, ఆ తర్వాతే లోనికి వెళ్లాల్సి ఉంటుంది.
లోనికి వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అవుట్ టైంను రిజిస్టర్లో పేర్కొంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 180 మందికి పైగా రిజిస్టర్లో సంతకాలు చేసి కలెక్టరేట్లోనికి వెళ్లారు. డిపార్ట్మెంట్ హెచ్వోడీలతో పాటు స్టాఫ్కు సంబంధించిన వెహికల్స్కు వేర్వేరు రంగుల్లో ఏడాది వ్యాలిడిటీ ఉన్న స్టిక్కర్లు జారీ చేశారు. ఈ స్టిక్కర్ ఉన్న వెహికల్నే గేటు వద్ద ఉన్న గార్డ్ లోనికి అనుమతిస్తారు. అంబులెన్స్, ఫైర్, పోలీసు వెహికల్స్ వచ్చినా గార్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

