కశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేత

కశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధించిన ఆంక్షలు 39 రోజుల తర్వాత ఎత్తేసింది. సమాచార, పౌర సంబంధాల అధికారులు దీనికి సంబంధించి ప్రకటించారు. ఫోన్ ల్యాండ్‌లైన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చామని, కుప్వారా, హంద్వారాలో కూడా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ ఆంక్షలను ఎత్తివేశామని …ప్రజలు బయటకు వస్తుండటంతో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిందని చెప్పారు.