అర్ధరాత్రి రిటైర్డ్ ఎఎస్ఐ ఇంట్లోకి చొరబడి.. కర్రతో కొట్టి చంపి పరారైన రౌడీ షీటర్

అర్ధరాత్రి రిటైర్డ్ ఎఎస్ఐ ఇంట్లోకి చొరబడి.. కర్రతో కొట్టి చంపి పరారైన రౌడీ షీటర్

ప్రకాశం జిల్లా:  చీరాల మండలం తోటవారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తనను వీధిలో మందలించాడనే కోపంతో.. రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి.. కర్రతో కొట్టి చంపి పరారయ్యాడు రౌడీ షీటర్ సురేంద్ర. పోలీసు శాఖను సైతం ఉలిక్కిపడేలా చేసిందీ ఘటన. పరారైన రౌడీ షీటర్ సురేంద్ర కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

రిటైర్డ్ ఏఎస్సై నాగేశ్వరరావు నివాసం ఉంటున్న వీధిలో రౌడీ షీటర్ సురేంద్ర మద్యం తాగి అల్లరి చేస్తుండడంతొ  ఏఎస్సై నాగేశ్వరరావు స్పందించి మందలించాడు. తనను అందరి ఎదుటే తిట్టడంతో కక్ష పెంచుకున్న సురేంద్ర నిన్న అర్దరాత్రి ఏఎస్ఐ నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడ్డాడు. పట్టుడు కర్ర తో వెళ్లి దాడి చేశాడు. హఠాత్తుగా రౌడీ షీటర్ దాడి చేయడంతో ప్రతిఘటించలేకపోయిన ఏఎస్ఐ అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడం..  హత్యకు పాల్పడిన సురేంద్ర పరారయ్యాడు. ఇరుగు పొరుగు వచ్చి ఆస్పత్రికి  తరలించాలని చూడగా.. అప్పటికే చనిపోయాడు. రౌడీ షీటర్ సురేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు.