పాలకుల నిర్లక్ష్యంతో తెలుగు మూడో స్థానానికి: రేవంత్

పాలకుల నిర్లక్ష్యంతో తెలుగు మూడో స్థానానికి: రేవంత్

దేశంలోనే ఎక్కవ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యంతో మూడో స్థానానికి దిగజారిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. హిందీని దక్షిణాది రాష్ట్రాలపై నిర్భంద పాఠ్యాంశం చేయాలన్న కస్తూరీ రంగన్ కమిటీ సిఫార్సును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇది తమ అస్తిత్వంపై దాడి అన్నారు. హిందీ రాష్ట్రాలలో తెలుగు భాషను కూడా నిర్భందం చేయగలరా? అని ప్రశ్నించారు . హిందీని మాపై రుద్దాలన్న ప్రతిపాదన పై తక్షణమే కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.