ఓటుకు నోటు కేసు విచారణ: ఏసీబీ కోర్టుకు రేవంత్ ‌రెడ్డి

 ఓటుకు నోటు కేసు విచారణ: ఏసీబీ కోర్టుకు రేవంత్ ‌రెడ్డి

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో తెలంగాణలో A1, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈ రోజు(మంగళవారం) ACB కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు 2015లో మొదలై తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. అప్పట్లో ఆయనను ఏసిబి అధికారులు అరెస్టు చేశారు. కొన్ని నెలలు ఆయన జైలుల్లో ఉన్నారు. ఈ కేసులో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మినహా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న కోర్టు ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తమ వైపునకు ఆకర్షించేందుకు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి కెమెరాకు చిక్కారు.