టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయట్లే..కాలక్షేపం చేస్తుండ్రు

టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయట్లే..కాలక్షేపం చేస్తుండ్రు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ధాన్యం విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ తమ నైతిక బాధ్యతను విస్మరించాయని ట్వీట్ చేశారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. రైతుల శ్రమతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో పండిన చివరి గింజా కొనేవరకు రైతుల తరఫున కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.

రాహుల్ గాంధీ ట్వీట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలిపడం కరెక్ట్ కాదని రాహుల్ ని ఉద్దేశించి .. ట్వీట్ చేశారు కవిత. టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని రాహుల్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు కవిత. నిజాయితీ ఉంటే టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలపండని... విమర్శించారు. 

మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయట్లేదని.. సెంట్రల్ హాల్ లో కాలక్షేపం చేస్తున్నారని కవిత్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ అమ్మబోమని 2021 అగస్టులో ఒప్పందంపై కేసీఆర్ సంతకం చేశారని గుర్తుచేశారు. రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయాన్ని మర్చిపోయారా అని... కవితకు ఘాటుగా రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు

13 ఏండ్లకే సొంత బ్రాండ్..లక్షల్లో సంపాదన