గద్దర్ పేరుతో జిల్లా.. ట్యాంక్ బండ్పై విగ్రహం: సీఎం రేవంత్

గద్దర్ పేరుతో జిల్లా.. ట్యాంక్ బండ్పై విగ్రహం: సీఎం రేవంత్

ప్రజాగాయకుడు  గద్దర్ పేరుతో జిల్లా, ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనను కేబినెట్ లో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇక పై నంది అవార్డుల ప్లేసులో గద్దర్ పేరుతో ప్రభుత్వం అవార్డులిస్తుందని చెప్పారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు.  

గద్దర్ పేరుతో జిల్లా..ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం పెట్టాలన్న విజ్ఞప్తిని కేబినెట్ లో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్. సమాజ చైతన్యానికి గద్దర్ జీవితాన్ని త్యాగం చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ ముందుకు నడిపారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పాటైంది.  సాధించిన తెలంగాణలో కొందరు చీమల పుట్టలో పాములు చేరినట్లు చేరారు.గడీల పాలనను గద్దర్ వ్యతిరేకించారని రేవంత్ రెడ్డి చెప్పారు.