మోడీని ప్రశ్నించడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు?

మోడీని ప్రశ్నించడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు?

తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించిన మోడీని ప్రశ్నించడానికి కేసీఆర్ కు అంత భయమెందుకంటూ ట్వీట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవమానిస్తుంటే నికార్సైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతారన్నారు. జనగాం ప్రసంగం తర్వాత కేసీఆర్ ఖేల్ ఖతం అన్న విషయం అర్ధమైందంటూ ట్వీట్ చేశారు. దీనికి బై బై కేసీఆర్ అంటూ హాష్ ట్యాగ్ చేశారు రేవంత్ రెడ్డి.