తులసివనంలో గంజాయి మొక్క మంత్రి నిరంజన్ రెడ్డి

తులసివనంలో గంజాయి మొక్క మంత్రి నిరంజన్ రెడ్డి

మంత్రి నిరంజన్ రెడ్డి తులసివనంలో గంజాయి మొక్క లాంటివాడన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గుడి మాన్యాలును, వనపర్తిలోని రూ. 300 కోట్ల భూముల్ని కబ్జాచేస్తున్నారని ఆరోపించారు. వనపర్తి జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో MLC ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. నీతికి-అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి చిన్నారెడ్డి నికార్సయిన 24 క్యారెట్ల బంగారం లాంటివాడన్నారు. ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుక కావాలని.. అందుకు కాంగ్రెస్ MLC అభ్యర్ధి చిన్నారెడ్డికి ఒక్క అవకాశం కల్పించాలన్నారు. ఓటుతో కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు, రైతులను, నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు ఓటు ఎలా అడుగుతారన్నారు.