సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులను నిర్బంధిస్తే తప్ప సీఎం ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల గృహ నిర్బంధం, అరెస్టులే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ రేవంట్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ప్రజా సమస్యల పై ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులను నిర్భందిస్తే తప్ప ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుండి కాలు బయటపెట్టలేక పోతున్నారు.
— Revanth Reddy (@revanth_anumula) July 17, 2022
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల గృహ నిర్భందం, అరెస్టులే దీనికి నిదర్శనం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని అడ్డుకుంటారన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు స్థానిక కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు.