ఇసుక నుంచి గుడుంబా వరకు ఎమ్మెల్యే చేయని దందాల్లేవ్: రేవంత్

ఇసుక నుంచి గుడుంబా వరకు ఎమ్మెల్యే చేయని దందాల్లేవ్: రేవంత్

ఎన్ని కేసులు పెట్టినా ప్రగతి భవన్  గేట్లు బద్దలు కొడ్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  కేసీఆర్.. శాశ్వతమనుకున్న ప్రగతి భవన్ గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేదల చెమట వాసనకంటే కాంట్రాక్టర్ల సెంటు వాసనే  కేసీఆర్ కు ఇంపుగా ఉందా? అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మీటింగ్ లో   మాట్లాడిన రేవంత్.. రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ రావాలని చెప్పారు.  తన గడీని తొమ్మిది నెలల్లో కట్టుకున్న కేసీఆర్... నాలుగేళ్లయినా డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయలేదని విమర్శించారు.  అలాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ పై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక నుంచి గుడుంబా వరకు ఎమ్మెల్యే చేయని దందాలు లేవని ఆరోపించారు.  రెడ్యానాయక్ డోర్నకల్ కు నయా జమిందారుగా మారారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్ కుటుంబాన్ని ఓడించాలని తమ యువకులు ఇక్కడకు వచ్చారని చెప్పారు. డోర్నకల్ లో 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ జెండా ఎగరేసిన చరిత్ర ఉందన్నారు. పోలీసులను నమ్ముకుని తాను పాదయాత్ర చేయడం లేదని చెప్పారు. తమ పార్టీ  కార్యకర్తలను నమ్ముకుని యాత్ర చేస్తున్నాని అన్నారు.