జానారెడ్డిపై ఎవరూ గెలిచే పరిస్థితి లేదు

జానారెడ్డిపై ఎవరూ గెలిచే పరిస్థితి లేదు

తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించాలంటే జానారెడ్డితోనే సాధ్యమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. ఎర్రచెరువు తండా, గోలిమడక, నాయకుని తండాలో ఇవాళ ప్రచారం నిర్వహించారు. భగత్ ను బలిపశువును చేసి ఎన్నికల్లో నిలబెట్టారన్నారు. కేసీఆర్ కు నోముల కుటుంబంపై అంత ప్రేమ ఉంటే  భగత్ కు ఎమ్మెల్సీ ఇవ్వొచ్చుగా అన్నారు. జానా మీద ఎవ్వరూ గెలిచే పరిస్థితి లేదని సర్వేల్లో తెలిసి.. ఆఖరి నిమిషంలో భగత్ కు టికెట్ ఇచ్చారని చెప్పారు. కృష్ణపట్టెకు ఏనాడు రాని టీఆర్ఎస్ నాయకులకు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధంతా జానా చేసిందే అన్నారు రేవంత్.