ఉత్తరాఖండ్‌‌‌‌ రాయబారిగా పంత్‌‌

ఉత్తరాఖండ్‌‌‌‌ రాయబారిగా పంత్‌‌

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌‌ బ్యాటర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ తన స్వరాష్ట్రం  ఉత్తరాఖండ్‌‌ కు రాయబారిగా నియమితుడయ్యాడు. ఉత్తరాఖండ్‌‌ సీఎం పుష్కర్‌‌ సింగ్‌‌ ధామి గురువారం ఢిల్లీలో  ఏర్పాటు చేసిన సమావేశంలో పంత్‌‌ను తమ రాష్ట్ర రాయబారిగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. క్రికెట్‌‌లో అతను సాధించిన ఘనతలకు గాను ఈ గౌరవం ఇచ్చామన్నారు. రాష్ట్రానికి సేవ చేసే  అవకాశం అందించిన సీఎం పుష్కర్‌‌కు పంత్‌‌ కృతజ్ఞతలు తెలిపాడు.  ఉత్తరాఖండ్‌‌ రూర్కీలో పుట్టిన పంత్‌‌  అవకాశాల కోసం ఢిల్లీ వచ్చాడు.  ఏజ్‌‌ గ్రూప్‌‌ క్రికెట్‌‌ నుంచి ఢిల్లీకి ఆడి నేషనల్ టీమ్‌‌లోకి వచ్చాడు.