ATCల్లో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇక డ్రాప్ అవుట్ల తగ్గింపు మీద దృష్టి పెట్టాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కు మంత్రి పలు సూచనలు చేశారు.
హైదరాబాద్: మీ కృష్టితో ATCలో అడ్మిషన్లు పెరుతుగున్నాయి. ఇక డ్రాప్ అవుట్లపై దృష్టి పెట్టాలి అని ప్రిన్సిపల్ సెకట్రరీ దాన కిషోర్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఐటీఐ కాలేజీలో వందశాతం హాజరు ఉండేలా చూడాలని కోరారు. టాటా కంపెనీ సపోర్టు ఉంది.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా టీచర్స్ ట్రైనింగ్ మీద దృష్టి సారించాలన్నారు.
హైదరాబాద్ లోని MCRHRD భవన్ లో ATC సెంటర్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషిన్ యూజింగ్, బెస్ట్ ప్రాక్టీస్, కొత్త టెక్నాలజీ అడాప్షన్ పై ITI కాలేజీల ప్రిన్సిపల్స్ కు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ హాజరయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో 65 ATC ప్రిన్సిపల్స్, ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
