ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​తో ప్రాణ హాని : రాజ్ భూపాల్ గౌడ్

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​తో ప్రాణ హాని : రాజ్ భూపాల్ గౌడ్

శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, అతడి అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజ్ భూపాల్ గౌడ్ ఆరోపించారు.  బుధవారం శంషాబాద్​లోని ఊట్​పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం రాత్రి 11 గంటలకు బీఆర్ఎస్ నాయకులు తన ఇంటిపై దాడికి దిగారన్నారు.

శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఏదైనా గొడవ జరిగితే వీడియో తీసి పంపాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గూండాలకు పోలీసులు వత్తాసు పలకడం అన్యాయమన్నారు.  దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఊట్ పల్లి మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, బీజేపీ నేతలు  పాల్గొన్నారు.