కోరుట్ల మున్సిపల్ ఆఫీసులో ఆర్జేడీ తనిఖీ

కోరుట్ల మున్సిపల్ ఆఫీసులో ఆర్జేడీ తనిఖీ

 కోరుట్ల, వెలుగు: మున్సిపల్ అధికారులు రూల్స్ ప్రకారమే నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ వరంగల్​ఆర్జేడీ షాహీద్​మసూద్​ హెచ్చరించారు. గురువారం కోరుట్ల మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన తనిఖీ చేశారు. మున్సిపాలిటీలో పౌర సేవలు, రెవెన్యూ, శానిటేషన్, టౌన్​ప్లానింగ్, అకౌంట్స్, ఇంజినీరింగ్​ విభాగాల రికార్డులను పరిశీలించారు. పనుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలపై వివరాలు సేకరించారు. సిబ్బంది పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం కమిషనర్​చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలపై ఆఫీసర్లను విచారించారు. మున్సిపాలిటీలో రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని మూడు నెలల కింద ఆర్జేడీకి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలోనే ఆర్జేడీ కోరుట్ల మున్సిపాలిటీని తనిఖీ చేసినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్​ కమిషనర్​ రవీందర్​, మేనేజర్​ శ్రీనివాస్​, టీపీవో ప్రవీణ్​, టీపీఎస్​ రమ్య, పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.