కిడ్నీ ఆపరేషన్ తర్వాత ఇండియాకు లాలూ..కూతురు ఎమోషనల్ ట్వీట్

కిడ్నీ ఆపరేషన్ తర్వాత  ఇండియాకు లాలూ..కూతురు ఎమోషనల్ ట్వీట్

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ తర్వాత ఇవాళ సింగపూర్ నుంచి భారత్ కు రానున్నారు.  ఈ విషయాన్ని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు.  లాలూ ఆరోగ్యంపై వరుస ట్వీట్లు చేసిన రోహిణి తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారని  వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత లాలూకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారని.. అందుకే ఇండియాకు వచ్చిన తర్వాత లాలూను కలిసే వారందరూ  తప్పకుండా మాస్క్ లు ధరించాలని కోరారు. 

గతేడాది డిసెంబర్ 5న లాలూ ప్రసాద్ యాదవ్ కు సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. అతని రెండు కిడ్నీలు పనిచేయకపోతే..లాలూ కుమార్తె రోహిణి ఒక కిడ్నీ ఇచ్చి లాలూ ప్రాణాలు కాపాడింది.