ప్రైవేట్ అంబులెన్స్, కారు ఢీ..ఒకరు మృతి

ప్రైవేట్ అంబులెన్స్, కారు ఢీ..ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా: ప్రైవేట్ హాస్పిటల్ కి చెందిన అంబులెన్స్, కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో జరిగింది. కొత్తూరు గేట్ దగ్గర శ్రీశైలం హైవేపై ఎదురెదురుగా వస్తున్న అంబులెన్స్(ఓమ్నీ), కారు(షిప్ట్ డిజైర్) ఢీకొనడంతో అంబులెన్స్ లో ఉన్న వ్యక్తి అక్కడే మరణించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు.