రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబం మృతి

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబం మృతి

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరంగల్  జిల్లా కాజీపేట మండలం మట్టువడా పి ఎస్ లో  హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ కుటుంబం ఈ ప్రమాదంలో మృతి చెందింది.  తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకొని వస్తున్న దుర్గా ప్రసాద్ కారును లారీ ఢీకొట్టింది. మెడిగడ్డ  గ్రామ సమీపంలో హైదరాబాద్ వెళ్తున్న ఇనోవా కారును లారీ ఢీ కొనడంతో అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో దుర్గా ప్రసాద్, అతని  భార్య విజయ లక్ష్మి, కొడుకు శాంతన్, బావ రాజు, అక్క ఉన్నారు. డ్రైవర్ ఖలీల్ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.