మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులతో పాటుగా ఆరుగురు మృతి చెందారు.  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రలును స్థానిక ఆసుపత్రికి తరలించారు.  మృతులను మోతి ఘనాపూర్‌ వాసులుగా గుర్తించారు. 

తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలనగర్‌లో జరిగే వారపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆరుగురు మృతికి  కారణమైన డీసీఎంను స్థానికులు తగలబెట్టారు.