ఆటోను ఢీకొట్టిన డీసీఎం.. ఆరుగురు మృతి

ఆటోను  ఢీకొట్టిన డీసీఎం.. ఆరుగురు మృతి

ములుగు జిల్లా: ఎర్రిగట్టమ్మ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపోయారు. స్పాట్ లో నలుగురు చనిపోగా.... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తొర్రూరు అన్నారం దర్గా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. ప్రమాద స్థలంలో వసంత, కిరణ్, అజయ్, ఆటో డ్రైవర్ జాని చనిపోగా... MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... వెన్నెల, రసూల్ మృతి చెందారు.