పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాట్నపల్లి వద్ద ఓ ప్రైవేట్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ కు రిసిప్షన్ వెళ్లి రామగుండంకు తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆటోను తప్పించే క్రమంలో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.